తెలిసో తెలియకో తప్పులు చేస్తే క్షమించండి: ఎమ్మెల్యే రాజయ్య

తెలిసో తెలియకో తప్పులు చేస్తే క్షమించండి: ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘనపుర్ నియోజకవర్గం తన వల్ల మహిళల ఆత్మగౌరవానికి కేంద్రంగా ఉందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మహిళల అభివృద్ధి, వారి ఆత్మ గౌరవం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామన్నారు. తనకు నలుగురు చెల్లెల్లు ఉన్నారని..తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.  ఇప్పటి వరకు జరిగిన పరిణామాలకు తాను చింతిస్తున్నానని చెప్పారు. తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే మహిళా లోకాన్ని క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. 

జానకిపురం గ్రామాభిృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్థి అనేది నిరంతర ప్రక్రియ అని..జానకిపురం గ్రామ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ నవ్యప్రవీణ్ కు సూచించారు. జానకిపురం గ్రామాభివృద్ధికి సర్పంచ్ నవ్య ప్రవీణ్తో కలిసి పనిచేస్తామన్నారు.  గతంలో సర్పంచ్ టికెట్ ఇచ్చే సమయంలో తాను ప్రవీణ్ ను మాత్రమే చూశానని..నవ్యను ఎప్పుడు చూడలేదన్నారు.