జగిత్యాల జిల్లాలో డబుల్ రోడ్డు మంజూరు చేయాలని మంత్రికి వినతి

 జగిత్యాల జిల్లాలో డబుల్ రోడ్డు మంజూరు చేయాలని మంత్రికి వినతి

జగిత్యాల రూరల్, వెలుగు:  డబుల్ రోడ్డు మంజూరు చేయాలని గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలోని అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ (ఏటీసీ) ఐటీఐకి అనుబంధంగా ఉన్న కేంద్రానికి అప్రోచ్ రోడ్డు బాగోలేదని, డబుల్‌ రోడ్డు మంజూరు చేయాలని హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.  

సానుకూలంగా స్పందించిన మంత్రి సంబంధిత అధికారి తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్  కార్పొరేషన్ ఎండీ శశాంక్ తో  మాట్లాడనని అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు 
మంత్రి  వివేక్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.