మరోసారి అవకాశం ఇవ్వండి : సంజయ్ ‌‌కుమార్

మరోసారి అవకాశం ఇవ్వండి :  సంజయ్ ‌‌కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: తెలంగాణ ఏర్పాటు తర్వాత జగిత్యాల వేగంగా అభివృద్ధి చెందిందని, మరోసారి అవకాశమిస్తే  మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే సంజయ్ ‌‌కుమార్​ అన్నారు. శుక్రవారం 19వ వార్డు జంబీ గద్దె ప్రాంతానికి చెందిన గౌడ సంఘం, మైనార్టీ, ఇతర వర్గాల యువకులు బీఆర్ఎస్ ‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్​హయాంలో జగిత్యాల జిల్లా కేంద్రంగా మారిందన్నారు.

కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ ​చంద్రశేఖర్​గౌడ్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, సతీశ్ ‌‌, కౌన్సిలర్లు నారాయణరెడ్డి, నవీన్ పాల్గొన్నారు.