రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉసురుపోసుకుంటోంది

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉసురుపోసుకుంటోంది

ఉద్యోగులు, టీచర్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. 317 జీఓ కారణంగా ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసి, సీనియర్, జూనియర్ల మధ్య వైషమ్యాలు పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. 317 జీఓ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం నాటకాలు ఆడుతున్నారని సీతక్క ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఆ జీఓను రద్దుచేసే అవకాశమున్నా.. బీజేపీ అనవసర రాజకీయం చేస్తోందని అన్నారు. ప్రాణాలు తీసుకోవద్దని ఉద్యోగులను కోరిన సీతక్క.. కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారన్న విషయం నిన్న మంత్రుల పర్యటనతో బయటపడిందని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి..

ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం

మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కు కరోనా