నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా

నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా

ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరుతున్నారు. ఇందుకు గాను.. నియోజక వర్గ ప్రజలకు తాను పార్టీ మారుతుందన్నందుకు వివరణ ఇచ్చుకున్నారు సుధీర్ రెడ్డి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే తన లక్ష్యమన్నారు. బీఎన్ రెడ్డి నగర్ రిజిస్ట్రేషన్ సమస్యతో పాటు ఆస్తి పన్ను తగ్గింపునకు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ మారుతున్న తీరును నియోజకవర్గ ప్రజలకు వివరించారు.  తన నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని కోరారు.