బండి సంజయ్.. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీస్కరా : సుంకె రవిశంకర్

బండి సంజయ్.. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీస్కరా : సుంకె రవిశంకర్

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూర్తిగా విఫలమయ్యాడని చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ నుంచి ఎంపీగా సంజయ్... నగర అభివృద్ధికి గానీ రాష్ట్ర అభివృద్ధికి గానీ ఏనాడు ఒక్క రూపాయి తేలేదని విమర్శించారు.  కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 600 కోట్లు నిధులు కేటాయించారని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని  నిధులను కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారని రవిశంకర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటుగా దేవాలయాల అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. దమ్ముంటే బండి సంజయ్ ఇప్పటికైనా కేంద్రం నుంచి నిధులను తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడలన్నాురు.