టీఎంసీకీ ఎమ్మెల్యే రాజీనామా

టీఎంసీకీ ఎమ్మెల్యే రాజీనామా

కోల్ కతా: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు సీనియర్ ఎమ్మెల్యే తపస్ రాయ్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్టు ప్రకటించారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే రాజీనామా చేశానని సోమవారం తెలిపారు. రాయ్ తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీకి సమర్పించారు. పార్టీ, ప్రభుత్వ పదవులకు కూడా రాజీనామా చేశానని అందుకు సంబంధించిన పేపర్స్ ను మార్చి 1న స్పీకర్ కు అందించానని చెప్పారు. 

జనవరిలో తపస్ రాయ్ నివాసాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. అప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని, మౌనం వహించిందని అందుకే రాజీనామా చేశానని తపస్ రాయ్ పేర్కొన్నారు.