ముదిరాజ్ల అభివృద్ధికి కృషి చేస్తా : తోట లక్ష్మీకాంతారావు

ముదిరాజ్ల అభివృద్ధికి కృషి చేస్తా : తోట లక్ష్మీకాంతారావు
  • ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

పిట్లం, వెలుగు : ముదిరాజ్​ల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం మద్నూర్​లో బీసీ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముదిరాజ్​లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సంఘ భవన ప్రహారికి ఎమ్మెల్యే రూ. 20 లక్షలు మంజూరు చేశారు. అంతకుముందు మహర్షి వాల్మీకి విగ్రహ, శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 

రాచూర్​లో వైద్య శిబిరం..

మండలంలోని రాచూర్​ గ్రామంలో గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పరిశీలించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇచ్చారు. వ్యాధి తీవ్రతను బట్టి కొందరిని మద్నూర్​ సీహెచ్​సీ కి పంపించారు.