శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూర్ పట్టణంలోని ప్రతాప మారుతి హనుమాన్ మందిరం వద్ద శోభాయాత్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.  హనుమాన్ మాలధారణ స్వాములతో కలిసి పుర వీధుల్లో శోభాయాత్రలో పాల్గొన్నారు.  మార్కెట్ ఏరియాలో మహిళలతో కలిసి కోలాటం ఆడారు.  జగన్నాథాయలయంలో కళ్యాణ మహోత్సవంలో  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

చెన్నూర్ పట్టణంలో కొత్తగూడెం కాలనీలో విశ్వ కర్మ కళ్యాణ మండపంలో మహమ్మాయి అమ్మవారి పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మందమర్రి మూడవ జోన్ లోని కోదండ రామాలయంలో సీతరాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు పాల్గొన్నారు.  స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.