బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యేలు డుమ్మా

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యేలు డుమ్మా
  •    హాజరుకాని పద్మారావు గౌడ్, మాగంటి, ముఠా గోపాల్   

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ హైదరాబాద్ ​జిల్లా ఆత్మీయ సమ్మేళనానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్​లో పార్టీ జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మహమూద్​అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, పార్టీ కార్యక్రమాల ఇన్​చార్జ్ దాసోజు శ్రవణ్​ తదితరులు హాజరయ్యారు. ముందస్తు సమాచారం ఇచ్చినా డిప్యూటీ స్పీకర్ ​పద్మారావు గౌడ్, పార్టీ హైదరాబాద్ ​జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ​ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ హాజరుకాలేదు. ఏడాది దాటినా హైదరాబాద్ ​జిల్లా అధ్యక్ష బాధ్యతలు గోపీనాథ్​ చేపట్టలేదు. ముఖ్య నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలతోనే ఆయన బాధ్యతలు స్వీకరించ లేదనే ప్రచారం ఉంది. దీనికి బలం చేకూరుస్తూ ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు మాత్రమే ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.