సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తయ్ : యాదవరెడ్డి,వంటేరు ప్రతాప్​రెడ్డి

సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తయ్ : యాదవరెడ్డి,వంటేరు ప్రతాప్​రెడ్డి

ములుగు, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరోసారి బీఆర్​ఎస్​ను గెలిపిస్తాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్​డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్​రెడ్డి చెప్పారు. బుధవారం ములుగులో పార్టీ మండల అధ్యక్షుడు జహాంగీర్ ఆధ్వర్యంలో  కేఎంఆర్ ఫంక్షన్ హాల్​లో మండల బూత్ కమిటీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈసారి కూడా సీఎం కేసీఆర్​ బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టో తయారు చేశారన్నారు.

కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గజ్వేల్​లో కేసీఆర్​ను లక్షకు పైగా మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి,  జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సలీం, గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి అంజన్ గౌడ్, మైనార్టీ రాష్ట్ర యూత్ విభాగం ఉపాధ్యక్షుడు జుబేర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగిశెట్టి గణేశ్​గుప్తా, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు  లింగారెడ్డి, రైతు సమితి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భూపాల్ రెడ్డి, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కుక్కల నరేశ్​ గౌడ్, నాయకులు బాబు గౌడ్, కొన్యాల బాల్ రెడ్డి, మల్లేశ్​ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, బాలేశ్, ఐలేశ్ యాదవ్, చంద్రం భూపాల్ రెడ్డి, ప్రవీణ్ హరిబాబు, అశోక్ పాల్గొన్నారు.