అధికార పార్టీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన స్థలాన్ని కాపాడాలంటూ తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు. 51, 52 సర్వే నెంబర్ లోని హాస్పిటల్ భూమిని అధికార పార్టీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాయికల్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ బదిలీకి కారణాలు చెప్పాలని ప్రశ్నించారు.
మరిన్ని వార్తల కోసం