ఆడబిడ్డల సొమ్ము కాజేసిన ఎవరూ బాగుపడలేదు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆడబిడ్డల సొమ్ము కాజేసిన ఎవరూ బాగుపడలేదు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటెల రాజేందర్ ఏం చేశారు..పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు తగ్గించారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు పట్టం కడితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. ఆడబిడ్డలకు అందాల్సిన 2వేల కోట్లను కాజేశారని ఆరోపించారు. ఆడబిడ్డల సొమ్ము కాజేసిన ఎవరూ బాగుపడలేదని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేస్తామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇళ్లు కట్టుకునేందుకు 2014 లో రూ.5 లక్షలు ఇస్తామన్న కేసీఆర్.. ఇప్పుడు రూ.3 లక్షలు అంటుండని వ్యాఖ్యానించారు. ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు లబ్ది చేకూరేలా చేసే బాధ్యత కాంగ్రెస్ ది అని భరోసా ఇచ్చారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడే ఏకైక ఉద్యమ నాయకుడు రేవంత్ అని..అలాంటి ఉద్యమ నాయకుడు ఈ గడ్డకు రావడం గర్వకారణమని కొనియాడారు. బలహీన వర్గాలను ఓటు అడిగే హక్కు కేసీఆర్ కు లేదని విమర్శించారు.