రాష్ట్రంలో సంక్షేమాన్ని ఆపే కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రానికి ఆదాయం రాకుండా ఒడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న ఆమె ..ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత వెంట మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పట్టొళ్ల కార్తీక్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
Blessed to have offered my prayers at the iconic, oldest and beautiful Balapur Ganesh Mandapam, today.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 8, 2022
May the blessings of Lord Ganesha always be with us.
Thank you and congratulations to Balapur Ganesh Utsav Committee for another landmark celebration.#GaneshChaturthi2022 pic.twitter.com/GVa7SYjrjv
లడ్డూ వేలం కోసం ఆసక్తిగా..
వినాయకుని దయ వల్ల ప్రజలు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. గణేషుడి దయవల్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిరంతరాయంగా జరగాలని కోరుకున్నారు. భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నట్లు చెప్పారు. బాలాపూర్ వినాయకుని లడ్డూ వేలంపై ప్రజలు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. ఈ సారి కూడా లడ్డూ రికార్డు ధర పలుకుతుందని ధీమా వ్యక్తం చేశారు.