
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థత గురైంది. మంగళవారం (జూలై 16,2024 )కవితకు జ్వరం రావడంతో చికిత్స కోసం కవితను పశ్చిమ ఢిల్లీలోని హరినగర్ లో ఉన్న దీనదయాళ్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కవితని తీహార్ జైలుకు తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నాలుగు నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు. అనంతరం ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక కోర్టు రౌస్ అవెన్యూ వాదనల అనంతరం తీహార్ జైలుపంపారు. ఇప్పటివరకు అనేక మార్లు సీబీఐ, ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఇప్పటివరకు బెయిల్ లభించలేదు.