విభజన కుట్రలను చాటిచెప్పాలె

విభజన కుట్రలను చాటిచెప్పాలె

హైదరాబాద్‌‌, వెలుగు: సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్న శక్తుల కుట్రలను కవులు, రచయితలు ప్రజలకు చాటి చెప్పాలని భారత్ జాగృతి ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సాహిత్య ఆజ్‌‌తక్‌‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలో సుహృద్భావ వాతావరణం పెంపొందించేలా సాహితీవేత్తలు కృషి చేయాలన్నారు.

సాహిత్య రంగంలో విశేష కృషి చేసేవారికి వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్, ఇండియూ టుడే సంయుక్తంగా సాహిత్య పురస్కారాన్ని అందిస్తాయని ప్రకటించారు. కవులు, రచయితలను ప్రోత్సహించడానికే ఈ అవార్డును నెలకొల్పామన్నారు. సమాజాన్ని విడగొట్టడానికి, మనుషులను దూరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళమెత్తాలని కోరారు. కవులు, రచయితలకు ఇండియా టుడేతో పాటు భారత్ జాగృతి ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు.