![కరెంట్పై కట్టుకథలు చెప్పడం మానండి : కవిత](https://static.v6velugu.com/uploads/2023/11/mlc-kavitha-counter-to-kishan-reddy-over-on-power_dUlc3yBTLs.jpg)
హైదరాబాద్, వెలుగు : కరెంట్ పై కట్టుకథలు చెప్పడం మానాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సూచించారు. మోదీ ప్రభుత్వం.. రామగుండం ఎన్టీపీసీ నుంచి తెలంగాణ మొత్తానికి కరెంట్సరఫరా చేస్తున్నదని కిషన్రెడ్డి చేసిన ట్వీట్కు కవిత కౌంటర్ఇచ్చారు. రాష్ట్రంలో 15,500 మెగా వాట్ల కరెంట్ డిమాండ్ ఉంటే ఎన్టీపీసీ నుంచి ఇచ్చేది కేవలం 680 మెగావాట్లు ఆమె ట్వీట్ చేశారు. స్టేట్ డిమాండ్లో 4% మాత్రమే ఎన్టీపీసీ నుంచి ఇస్తున్నారని వివరించారు. కేంద్రమే నిరంతరం కరెంట్ ఇస్తుందనే అబ ద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్కృషితోనే తెలంగాణలో కరెం ట్కష్టాలు తీరాయన్నారు. లోటు నుంచి మిగు లు రాష్ట్రంగా చేసిన ఘనత సీఎంది అన్నారు.