
- కాంగ్రెస్ హామీల అమలుకు సోనియాకు లెటర్లు రాసిన ఎమ్మెల్సీ
బషీర్బాగ్, వెలుగు: ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్అధినేత్రి సోనియాగాంధీకి లెటర్లు రాశారు. మహిళలకు రూ.2500 ఇవ్వడంతో పాటు, చేయూత పింఛన్ల మొత్తాన్ని పెంచాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అబిడ్స్ జీపీఓ వద్ద సోనియాగాంధీకి లెటర్లు రాసి పోస్ట్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చకు రెడీనా అని రేవంత్రెడ్డికి సవాల్విసిరారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడితే చర్చిద్దామన్నారు. చంద్రబాబును పిలిచి ప్రజాభవన్ లో బిర్యానీ తినిపించారని, గోదావరి నీటిని గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబుకు ఇచ్చారన్నారు. కేసీఆర్ హయాంలో బనకచర్ల ఊసే లేదని, సీఎం హోదాలో కేసీఆర్ ఎక్కడా సంతకాలు పెట్టలేదన్నారు.
స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని... బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. హైకోర్టు ఇచ్చిన టైంలోపు, సర్కారు ఆర్డర్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్నారు.