ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్..

ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్..

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ ఖతాలు హ్యాక్ కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి  10  గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించారు.  

అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత.. తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు.