బీఆర్​ఎస్​కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల రాజీనామా

బీఆర్​ఎస్​కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల రాజీనామా

కొల్లాపూర్​(నాగర్​ కర్నూల్​), వెలుగు : ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి బీఆర్ఎస్​ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్​ చేస్తానని స్పష్టం చేశారు. రాజీనామా లెటర్​ను ఫ్యాక్స్​ ద్వారా సీఎం కేసీఆర్​కు పంపించారు. గురువారం కొల్లాపూర్​లో ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యల విషయంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను కేసీఆర్​ దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నించానని

10 సార్లు ట్రై చేసినా సీఎం అపాయింట్​మెంట్ దొరకలేదన్నారు. ఇదే విషయాన్ని పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదన్నారు. కాంగ్రెస్ ​హయాంలో తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్​ను ఎన్నోసార్లు కలిశానన్నారు.  కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.