- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లేఖ
హైదరాబాద్, వెలుగు: జనవరి 3 నుంచి జరగబోయే టీజీ టెట్ పరీక్షలకు హాజరయ్యే ఇన్సర్వీస్ టీచర్లకు ఆన్డ్యూటీ (ఓడీ) సదుపాయం కల్పించాలని టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. టీచర్లకు పరీక్షా కేంద్రాలను సొంత జిల్లాల్లో గానీ, వారు పనిచేసే ప్రాంతానికి దగ్గరలో గానీ కేటాయించాలన్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు ఆయన లేఖ రాశారు.
