ఓయూలో మాక్ అసెంబ్లీ.. సీఎంగా ఈటల

ఓయూలో మాక్ అసెంబ్లీ.. సీఎంగా ఈటల

హుజురాబాద్ ప్రజలు రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అధికారం ఉందని సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో రాజ్యాంగ విలువలను పాటించలేదని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇచ్చారు. యువకులు కలిసి కట్టుగా లేకుంటే అణచివేస్తారని ఈటల హెచ్చరించారు. 

ఈ మాక్ అసెంబ్లీలో ఈటల ముఖ్యమంత్రి రోల్ పోషించారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్, జాతీయ మీడియా సలహదారుడు దేవులపల్లి అమర్ గవర్నర్ పాత్రను పోషించారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ లీడర్ పేరాల శేఖర్ రావు, మురళీ మనోహర్ విద్యాశాఖ మంత్రిగా, కాంగ్రెస్ నాయకుడు దాసోజు శ్రవణ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, యువతెలంగాణ పార్టీ నాయకురాలు రాణి రుద్రమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ హోంశాఖ మంత్రిగా పాత్రలు పోషించారు. అంతేకాకుండా రజనీకాంత్ ఎర్రబెల్లి, సాయి కృష్ణ, దేవీకారెడ్డి ప్రముఖ జర్నలిస్టుల పాత్రను పోషించారు.