నిజామాబాద్ జిల్లాలో మోస్తరు వర్షం.. తడిసిన ధాన్యం

నిజామాబాద్ జిల్లాలో మోస్తరు వర్షం.. తడిసిన ధాన్యం

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో బుధవారం పలుచోట్ల చిరు జల్లులు కురువగా, కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మెంగారం, శెట్పల్లి సంగారెడ్డి, సంగారెడ్డి,   లింగంపేట, తాడ్వాయి మండలంలోని   ఎండ్రియాల్; దేవాయిపల్లి, కాలోజివాడి,  కృష్ణాజీవాడిలో  వడ్ల కుప్పలు, దేవాయిపల్లిలో మక్కలు తడిసిపోయాయి.  బీర్కుర్, నస్రుల్లాబాద్ మండలాల్లో రోడ్ల పక్కన అరబోసిన వడ్లు తడిశాయి. పిట్లం మండలంలో సెంటర్​లో వడ్లు తడిసి ముద్దయ్యాయి.    

నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మహ్మద్​నగర్, నిజాంసాగర్​ మండలాల్లో  వడ్ల రాసులు తడిసి పోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో కొనుగోలు సెంటర్లు, రోడ్లపై ఆరబోసిన వడ్ల కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కొన్నచోట్ల డ్రోన్​సాయంతో వడ్లను 
ఆరబెట్టుకున్నారు.  --కామారెడ్డి/వెలుగు ఫొటోగ్రాఫర్​, నిజామాబాద్