
ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శించారు. మోదీ, కేడీ కలిసి సిలిండర్ రూ.12 వందలు చేశారని అన్నారు. కూకట్ పల్లిలో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేసిన దోపిడిని చూసి తెలంగాణ ప్రజలు బీఆర్ఎను బంగాళాఖాతంలో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని అన్నారు.
తన ఇంటి తలుపులు పగలొగట్టి అర్థరాత్రి పూట అరెస్టు చేశారని చెప్పారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎవ్వరూ ఎవ్వరికి బయపడాల్సిన అవసరం లేదన్నారు. బస్తీలలో ఉండే 26 కులాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు ఇస్తున్నామని అన్నారు.
మోదీ కేడీ కలిసి సిలిండర్ రూ. 12 వందలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి ఇంటికి రూ. 500 కే గ్యాస్ ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. పట్నం సునితను ఎంపీగా గెలిపిస్తే మల్కాజ్ గిరి మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.