కాంగ్రెస్ లో చేరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

కాంగ్రెస్ లో చేరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

ప్రధాని మోదీపై విమర్శలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన హోదా మరిచి మోదీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. దేశంలో ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమి లేదని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. మతం పేరు మీద బీజేపీ ఓట్లడుకుంటుందని ఆరోపించారు. 

రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఉత్తమ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకురాలు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ దీపా దాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. ఐదేళ్ల పాటు స్థిరత్వ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణకు మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అవుతారని మోదీకి అర్థమైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.