ప్రధాని మోదీ అవినీతి పాఠశాల నడుపుతున్నారు : రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ అవినీతి పాఠశాల నడుపుతున్నారు : రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.  నరేంద్ర మోదీ దేశంలో అవినీతి పాఠశాల నడుపుతున్నారని విమర్శించారు. అవినీతి సైన్స్‌ అనే సబ్జెక్ట్‌ కింద బోధిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తన నేతలకు ఈ కోర్సును తప్పనిసరి చేసిందని విరాళం వ్యాపారంతో సహా ప్రతి పాఠాన్ని తనే చెబుతున్నారని విమర్శించారు. దాడులు చేసి విరాళాలు ఎలా సేకరిస్తారు? విరాళాలు తీసుకున్న తర్వాత కాంట్రాక్టులు ఎలా పంపిణీ చేస్తారు? అనే అన్ని కోర్సులు నేర్పించారని విమర్శించారు.

 అవినీతిపరులను ఉతికి ఆరేసే వాషింగ్ మెషీన్ ఎలా పని చేస్తుందని రాహుల్ ప్రశ్నించారు. ఏజెన్సీలను రికవరీ ఏజెంట్లుగా చేసి బెయిల్- జైలు ఆట ఎలా ఆడుతుంది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అవినీతి పాఠశాలకు తాళం వేస్తామని ఈ కోర్సులను శాశ్వతంగా మూసివేస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.