ట్రంప్​కు ఇచ్చిన ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుంది

ట్రంప్​కు ఇచ్చిన ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుంది

ట్రేడ్ ఒప్పందం కుదురుతుంది

చర్చలు మొదలయ్యాయి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ‘‘కామర్స్​ మినిస్టర్ల మధ్య కుదిరిన అవగాహన మేరకు రెండు దేశాల టీమ్స్​ లీగల్​ చర్యలు తీసుకునేందుకు నేను, ట్రంప్​ అంగీకరించాం. ఒక భారీ ట్రేడ్​ డీల్​పై సంప్రదింపులు మొదలుపెట్టేందుకు కూడా ఆమోదం తెలిపాం. రెండు దేశాల ప్రయోజనాల దృష్ట్యా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం”అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ట్రేడ్​కు సంబంధించి రెండు దేశాల కామర్స్​ మినిస్టర్ల మధ్య చర్చలు పాజిటివ్​గా కొనసాగుతాయని చెప్పారు. 21వ దశాబ్దంలో అత్యంత కీలకమైన పార్ట్​నర్​షిప్స్​లో ఇండో-యూఎస్​ సంబంధాలు కూడా ఒకటని అన్నారు. ఈ రిలేషన్​షిప్​లో రెండు దేశాల డిఫెన్స్, సెక్యూరిటీ సహకారం చాలా కీ రోల్​ పోషించిందని చెప్పారు. మంగళవారం ఢిల్లీ హైదరాబాద్​ హౌస్​లో ట్రేడ్, కౌంటర్​ టెర్రరిజం, ఎనర్జీ కోఆపరేషన్​ సహా పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చల తర్వాత అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​తో కలసి ప్రధాని మోడీ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్య విలువల వల్లే సాధ్యమైందని, ఇండో–పసిఫిక్, గ్లోబల్​గా ఉన్న పరిస్థితులే ఈ సహకారానికి ప్రధాన కారణమని మోడీ చెప్పారు.

ఆతిథ్యం గుర్తుండిపోతుంది

‘‘ప్రపంచంలో కనెక్టివిటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ అభివృద్ధికి స్థిరమైన, పారదర్శకమైన ఫైనాన్సింగ్ అవసరమని మేమిద్దరం అంగీకరించాం. మా మధ్య కుదిరిన ఒప్పందం రెండు దేశాలకే కాదు.. ప్రపంచ ప్రయోజనాలకు కీలకం”అని మోడీ తెలిపారు. ఇండో‌‌‌‌-యూఎస్​ సంబంధాలను రెండు దేశాల స్థాయి నుంచి గ్లోబల్​ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. డ్రగ్​ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, ఆర్గనైజ్డ్​ క్రైమ్స్​​ను నియంత్రించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. ట్రంప్​కు ఇచ్చిన చరిత్రాత్మక ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్యా సంబంధాలు ప్రభుత్వాల నుంచి కాకుండా ప్రజల నుంచే ముందుకు వెళుతున్నాయని అన్నారు. డిఫెన్స్, సెక్యూరిటీ, ఎనర్జీ స్టాటజిక్​ పార్ట్​నర్​షిప్,​ టెక్నాలజీలో కోఆపరేషన్,​ ట్రేడ్​ రిలేషన్​షిప్స్, ప్రజల మధ్య సంబంధాలు ఇలా ప్రతి అంశంపైనా ఇద్దరం నిర్మాణాత్మకమైన చర్చలు జరిపామని చెప్పారు. రెండు దేశాల ట్రేడ్​ సంబంధాలు మూడేండ్లలో రెండంకెల స్థాయికి చేరాయని, ఇది మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఇండో-యూఎస్ మధ్య ట్రేడ్..​ ఫెయిర్​గా, బ్యాలన్స్​డ్​గా జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోడీ చెప్పారు.

For More News..

ఓయూలో రేపు జాబ్​ మేళా

హాస్టల్ బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

శ్రీదేవి లాంటి వాళ్లకే తప్పలేదు

టీఆర్ఎస్ ​కబ్జా చేసిన భూములతో లక్షల ఇండ్లివ్వొచ్చు