
ట్రేడ్ ఒప్పందం కుదురుతుంది
చర్చలు మొదలయ్యాయి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ‘‘కామర్స్ మినిస్టర్ల మధ్య కుదిరిన అవగాహన మేరకు రెండు దేశాల టీమ్స్ లీగల్ చర్యలు తీసుకునేందుకు నేను, ట్రంప్ అంగీకరించాం. ఒక భారీ ట్రేడ్ డీల్పై సంప్రదింపులు మొదలుపెట్టేందుకు కూడా ఆమోదం తెలిపాం. రెండు దేశాల ప్రయోజనాల దృష్ట్యా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం”అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ట్రేడ్కు సంబంధించి రెండు దేశాల కామర్స్ మినిస్టర్ల మధ్య చర్చలు పాజిటివ్గా కొనసాగుతాయని చెప్పారు. 21వ దశాబ్దంలో అత్యంత కీలకమైన పార్ట్నర్షిప్స్లో ఇండో-యూఎస్ సంబంధాలు కూడా ఒకటని అన్నారు. ఈ రిలేషన్షిప్లో రెండు దేశాల డిఫెన్స్, సెక్యూరిటీ సహకారం చాలా కీ రోల్ పోషించిందని చెప్పారు. మంగళవారం ఢిల్లీ హైదరాబాద్ హౌస్లో ట్రేడ్, కౌంటర్ టెర్రరిజం, ఎనర్జీ కోఆపరేషన్ సహా పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చల తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో కలసి ప్రధాని మోడీ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్య విలువల వల్లే సాధ్యమైందని, ఇండో–పసిఫిక్, గ్లోబల్గా ఉన్న పరిస్థితులే ఈ సహకారానికి ప్రధాన కారణమని మోడీ చెప్పారు.
ఆతిథ్యం గుర్తుండిపోతుంది
‘‘ప్రపంచంలో కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి స్థిరమైన, పారదర్శకమైన ఫైనాన్సింగ్ అవసరమని మేమిద్దరం అంగీకరించాం. మా మధ్య కుదిరిన ఒప్పందం రెండు దేశాలకే కాదు.. ప్రపంచ ప్రయోజనాలకు కీలకం”అని మోడీ తెలిపారు. ఇండో-యూఎస్ సంబంధాలను రెండు దేశాల స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ను నియంత్రించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. ట్రంప్కు ఇచ్చిన చరిత్రాత్మక ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్యా సంబంధాలు ప్రభుత్వాల నుంచి కాకుండా ప్రజల నుంచే ముందుకు వెళుతున్నాయని అన్నారు. డిఫెన్స్, సెక్యూరిటీ, ఎనర్జీ స్టాటజిక్ పార్ట్నర్షిప్, టెక్నాలజీలో కోఆపరేషన్, ట్రేడ్ రిలేషన్షిప్స్, ప్రజల మధ్య సంబంధాలు ఇలా ప్రతి అంశంపైనా ఇద్దరం నిర్మాణాత్మకమైన చర్చలు జరిపామని చెప్పారు. రెండు దేశాల ట్రేడ్ సంబంధాలు మూడేండ్లలో రెండంకెల స్థాయికి చేరాయని, ఇది మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఇండో-యూఎస్ మధ్య ట్రేడ్.. ఫెయిర్గా, బ్యాలన్స్డ్గా జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోడీ చెప్పారు.
For More News..