పదకొండు రోజులు.. మోదీ ప్రత్యేక దీక్ష

పదకొండు రోజులు.. మోదీ ప్రత్యేక దీక్ష
  •  అయోధ్యలో రామ మందిర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్ణయం

ముంబై: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో తాను శుక్రవారం నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక నియమ నిష్ఠలు పాటించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘‘జీవితంలో మొదటిసారిగా నేను చాలా భావోద్వేగానికి గురవుతున్నా. ఎన్నో తరాల పాటు ప్రజలు కలగన్న రాముడి గుడి ఇప్పుడు ప్రారంభం అవుతుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది” అని దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. 

‘‘ప్రాణ ప్రతిష్ఠ వేడుకల నిర్వహణ కోసం 140 కోట్ల భారతీయులందరి తరఫున ప్రతినిధిగా దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఇది చాలా పెద్ద బాధ్యత. ఈ పవిత్ర కార్యాన్ని నిర్వహించేముందు ప్రత్యేక నియమ నిష్ఠలతో పూజలు చేయాలి. అందుకే నేను శుక్రవారం నుంచే నిష్ఠతో ఉంటున్నా. శ్రీరాముడు నాసిక్ లోని పంచవటిలో కొంతకాలం నివసించాడు. ఇక్కడి నుంచే నేను.. సాధువులు చెప్పినట్లుగా 11 రోజుల ప్రత్యేక నియమ నిష్ఠలను ప్రారంభిస్తున్నా”అని ప్రధాని తెలిపారు.