ODI World Cup 2023: ఆ రోజే చేయాలి: కోహ్లీ 49వ సెంచరీపై రిజ్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ODI World Cup 2023: ఆ రోజే చేయాలి: కోహ్లీ 49వ సెంచరీపై రిజ్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వరల్డ్ కప్ లో భారత్ తన తదుపరి మ్యాచ్ నవంబర్ 2 న శ్రీలంకపై ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది . 2011 లో వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంకపై భారత క్రికెట్ జట్టు ఇక్కడే వరల్డ్ కప్ గెలిచింది. మరోసారి అదే మైదానంలో అదే ప్రత్యర్థితో ఇక్కడ ఇరు జట్లు తలపడడం ఆసక్తికరంగా మారింది. అయితే అందరి దృష్టి మాత్రం ఆదివారం(నవంబర్ 5) జరగబోయే మ్యాచ్ మీదే ఉంది. నవంబర్ 5 న విరాట్ కోహ్లీ పుట్టిన రోజు ఉండడంతో ఈ మ్యాచ్ ప్రత్యేకంగా మారనుంది. 

కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోయే మ్యాచ్ రోజున విరాట్ కోహ్లీ తన 35 వ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరగనున్నాయి. విరాట్ బర్త్ డే కోసం స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ కూడా చేశారు. తాజాగా.. విరాట్ కోహ్లీ పుట్టిన రోజు గురించి పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ఈడెన్ గార్డెన్స్ లోనే నేడు(అక్టోబర్ 31) పాకిస్థాన్, బంగ్లాదేశ్ పై మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ సందర్భంగా రిజ్వాన్ ఇండియా టుడే – ఆజ్ తక్‌తో సరదాగా చిట్-చాట్ చేశాడు.

"కోహ్లీకి నా తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. అతని పుట్టిన రోజున అతడు తన 49 సెంచరీ పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నా. వరల్డ్ క లోనే తన 50 వ సెంచరీ కొట్టాలని ఆశిస్తున్నా" అని తెలియజేశాడు. కోహ్లీ తన పుట్టిన రోజు సెంచరీ చేయాలని మొత్తం భారత్ కోరుకుంటుంది. మరోవైపు బాబర్ అజామ్ మాత్రం విరాట్ కోహ్లీపై స్పందించలేదు. మరి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న విరాట్ తన 49 వ సెంచరీ పుట్టిన రోజు చేసుకుంటాడేమో చూడాలి.