మొరంగపల్లి రైల్వే స్టేషన్​లో కిలోకు పైగా గంజాయి సీజ్

మొరంగపల్లి  రైల్వే స్టేషన్​లో కిలోకు పైగా గంజాయి సీజ్

వికారాబాద్, వెలుగు: గంజాయి అమ్ముతున్న ముగ్గురిని వికారాబాద్ జిల్లా మోమిన్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మోమిన్ పేట పరిధిలోని మొరంగపల్లి రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గంజాయి అమ్ముతున్న వంశీ, వెంకట్, సాయికిరణ్​ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కిలో 534 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు.