కొచ్చి: కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్తోపాటు మరికొందరిపై ఈడీ అక్రమ నగదు చలామణి చట్టం(పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. ఆమె ఐటీ కంపెనీకి ఓ ప్రైవేట్ సంస్థ నుంచి అక్రమ చెల్లింపులు జరిగినట్టు ఆరోపించింది. ఈ కేసు విచారణకు సంబంధించి వీణాతోపాటు మిగతవారికి సమన్లు జారీచేయనుంది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసు పెట్టింది.
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్) అనే ప్రైవేట్ సంస్థ వీణాకు చెందిన ఐటీ కంపెనీ ఎక్సాలాజికల్ సొల్యూషన్కు 2018 నుంచి 2019 మధ్య రూ.1.72 కోట్లు అక్రమంగా చెల్లించినట్టు ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది. ఎలాంటి సేవలు అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్టు ఐటీశాఖ పేర్కొంది.