మధిర సిరిపురం బ్యాంకులో రూ.16 లక్షల 97 వేలు మాయం

మధిర సిరిపురం బ్యాంకులో రూ.16 లక్షల 97 వేలు మాయం
  •     క్యాషియర్​పై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు

మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలోని ఏపీజీవీబీ(ఆంధ్రప్రదేశ్​గ్రామీణ వికాస్​బ్యాంక్) బ్రాంచ్​లో దాదాపు రూ.17 లక్షలు మాయం అయ్యాయి. మధిర రూరల్​ఎస్సై ఉతల్​రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాతాదారులు జమచేసిన రూ.16,97,382 లెక్క తేలకపోవడంతో మేనేజర్​ రవి.. క్యాషియర్ సురేశ్​బాబుపై మధిర రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బ్యాంకులోని డబ్బును సురేశ్​బాబు తన సొంత అవసరాలకు వాడుకున్నాడని పేర్కొన్నాడు. క్యాషియర్​పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.