
హైదరాబాద్, వెలుగు: ఆనంద్ మెహతా రచించిన మనీ వైబ్ పుస్తకం హైదరాబాద్లో శనివారం విడుదలయింది. ఈ కార్యక్రమంలో రచయిత ఆనంద్ మెహతా, ప్యానలిస్టులు హాజరయ్యారు. ఈ పుస్తకం ఆర్థిక నిర్వహణపై అవగాహన కలిగిస్తుందని, మార్గదర్శినిగా పనిచేస్తుందని ఆనంద్ చెప్పారు. డబ్బును సమర్థంగా వాడుకునేందుకు అవసరమైన వ్యూహాలను, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే చిట్కాలు ఇందులో పొందుపరిచానని వివరించారు. ఖర్చుల నిర్వహణ, ఎక్కువ పొదుపు చేయడం, సంపదను సృష్టించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తుందని, డబ్బును తెలివిగా నిర్వహించగలగడం అత్యంత కీలకమని ఆనంద్ మెహతా చెప్పారు.