ఆనంద్ మెహతా రచించిన మనీ వైబ్ పుస్తకం విడుదల

ఆనంద్ మెహతా రచించిన మనీ వైబ్ పుస్తకం విడుదల

హైదరాబాద్​, వెలుగు: ఆనంద్ మెహతా రచించిన మనీ వైబ్  పుస్తకం హైదరాబాద్​లో శనివారం విడుదలయింది. ఈ కార్యక్రమంలో రచయిత ఆనంద్ మెహతా,  ప్యానలిస్టులు హాజరయ్యారు. ఈ పుస్తకం ఆర్థిక నిర్వహణపై అవగాహన కలిగిస్తుందని, మార్గదర్శినిగా పనిచేస్తుందని ఆనంద్​ చెప్పారు. డబ్బును సమర్థంగా వాడుకునేందుకు అవసరమైన వ్యూహాలను, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే చిట్కాలు ఇందులో పొందుపరిచానని వివరించారు.  ఖర్చుల నిర్వహణ, ఎక్కువ పొదుపు చేయడం, సంపదను సృష్టించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తుందని, డబ్బును తెలివిగా నిర్వహించగలగడం అత్యంత కీలకమని ఆనంద్​ మెహతా చెప్పారు.