మాన్‌‌సూన్ రెగట్టా చాంపియన్‌‌షిప్ పోటీలు: టాప్ ప్లేస్‌‌లో శ్రేయ, లాహిరి

మాన్‌‌సూన్ రెగట్టా చాంపియన్‌‌షిప్ పోటీలు: టాప్ ప్లేస్‌‌లో శ్రేయ, లాహిరి

హైదరాబాద్, వెలుగు: మాన్‌‌సూన్ రెగట్టా చాంపియన్‌‌షిప్ పోటీల్లో తెలంగాణ సెయిలర్లు లాహిరి కొమరవెల్లి, రిజ్వాన్ మహమ్మద్ సత్తా చాటుతున్నారు. మంగళవారం జరిగిన  సబ్-జూనియర్ గర్ల్స్‌‌ పోటీల్లో తమిళనాడుకు చెందిన శ్రేయ కృష్ణ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా,లాహిరి రెండో స్థానంలో కొనసాగుతోంది. అబ్బాయిల్లో తమిళనాడుకు చెందిన కృష్ణ వీఆర్,  రిజ్వాన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

ఐదో రేసులో సూపర్ పెర్ఫామెన్స్‌‌ చేసిన కృష్ణ.. రిజ్వాన్‌‌ను వెనక్కి నెట్టి టాప్‌‌ ప్లేస్‌‌ సొంతం చేసుకున్నాడు. తెలంగాణకే చెందిన రవి నాయక్ పల్త్య మూడో స్థానంలో నిలిచాడు. అండర్ 18 లేజర్ కేటగిరీలో ఆలియా సబ్రీన్ (తమిళనాడు), శరణ్య జాదవ్ (గోవా) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.  కాగా, 10 ఏండ్ల యంగ్ సెయిలర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన బిగినర్స్ లైట్ ఫ్లీట్ పోటీల్లో అరెపల్లి గ్రేసీ 15 రేసుల్లో 10 గెలిచి ఓవరాల్ చాంపియన్‌‌గా నిలిచింది.

మరిన్ని వార్తలు