- వెంటిలేటర్లపై ప్రధాని మోడీ ట్వీట్
న్యూఢిల్లీ: కరోనాపై పోరాడేందుకు మన దేశానికి వెంటిలేటర్లు ఇస్తామని యూఎస్ ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్కు థ్యాంక్స్ చెప్తూ శనివారం ట్వీట్ చేశారు. ఇండియా, యూఎస్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను ఇది మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. “ థ్యాంక్స్ ట్రంప్. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మనమంతా కలిసి పనిచేయాలి. ఇలాంటి టైంలో అందరం ఒకరికి ఒకరు సాయం చేసుకుంటే ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సృష్టించొచ్చు. కరోనాను జయించవచ్చు” అని మోడీ ట్వీట్ చేశారు. అమెరికాలో ఉంటున్న ఇండియన్స్పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా ఇలాంటి కష్ట సమయంలో ఇండియాతో, ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఉన్నాం అని ఆయన ట్వీట్ చేశారు.