ఈ మధ్య మనలో చాలామంది నొప్పి అనిపించడం ఆలస్యం పెయిన్కిల్లర్స్ మింగేస్తున్నారు. పిప్పర్మెంట్ బిళ్ళల్లా పెయిన్కిల్లర్స్ వాడుతున్నారని కొన్ని స్టడీలు కూడా చెప్పాయి. నిజానికి ఇలా చిన్నదానికీ, పెద్దదానికీ మందు బిళ్లలు మింగడం వల్ల కొత్త సమస్యలు కొనుక్కుని తెచ్చుకున్నట్టే. అలాకాకుండా ఉండాలంటే వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులను వాడాల్సిన రీతిలో వాడాలి. అలా చేయగలిగితే సైడ్ ఎఫెక్ట్స్లేకుండా కొన్ని నొప్పుల నుంచి బయటపడొచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.
బ్లోటింగ్, ఇన్ఫ్లమేషన్, నొప్పి... ఈ ఇబ్బందులకు వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా. అయితే ఇక మీదట పెరుగు తినండి. పెరుగులో హెల్దీ ప్రొబయాటిక్స్ ఉంటాయి. ఇవి డైజెస్టివ్ సిస్టమ్ను సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. రోజుకు రెండుసార్లు పెరుగు తింటే అరుగుదల మంచిగ ఉంటది. పొత్తికడుపు నొప్పి, నెలసరి కడుపు నొప్పుల వంటివి కూడా తగ్గిపోతాయి. కండరాలు, పంటి, తల, నరాల నొప్పులనుంచి రిలీఫ్ కావాలంటే పుదీనా కావాల్సిందే. కొన్ని పుదీనా ఆకులను నమిలితే డైజెషన్ సరిగా జరుగుతుంది. అంతేనా మైండ్కు ప్రశాంతత, హాయి కూడా. దీనిలో ఉండే థెరపిటిక్ ప్రాపర్టీస్ కండరాలు, నరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. ఒళ్లు నొప్పులు, తీపులు ఉంటే కూడా తగ్గిపోతాయి. అందుకని నిద్రపోయేముందు పది లేదా పన్నెండు చుక్కల పుదీనా ఆయిల్ వేసిన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.
అల్లంలో ఉండే యాంటీఇన్ఫ్లమెటరీ గుణాల వల్ల కండరాల నొప్పులు, ఆర్థరైటిస్, కడుపునొప్పి, ఛాతి, నెలసరి నొప్పుల నుంచి రిలీఫ్ ఉంటుంది. గ్యాస్ ఇబ్బంది నుంచి వెంటనే బయటపడాలంటే అల్లం ముక్క చప్పరించాలి. అల్లం చాయ్ తాగితే మైగ్రేన్ తలనొప్పుల నుంచి బయటపడొచ్చని స్టడీలు కూడా చెప్తున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, బ్రాంకైటిస్ వంటి సమస్యల నుంచి బయటపడేయడంలో అల్లం చాలా బాగా పనిచేస్తుంది. యాపిల్ సిడర్ వెనిగర్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్లూయిడ్ బాలెన్స్ చేస్తాయి. దానివల్ల డీహైడ్రేషన్, కండరాల నొప్పులు, తీపుల వంటివి ఉండవు. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ను ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో కలిపి రోజుకు ఒకసారి తాగితే కండరాల నొప్పులు పోతాయి.