గచ్చిబౌలిలో విషాద ఘటన.. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో భార్య టీవీ చూస్తుండగా..

గచ్చిబౌలిలో విషాద ఘటన.. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో భార్య టీవీ చూస్తుండగా..

గచ్చిబౌలి, వెలుగు: గత కొంతకాలంగా డిప్రెషన్​తో బాధపడుతున్న ఓ అసిస్టెంట్​ ప్రొఫెసర్ క్యాంపస్​ బిల్డింగ్​17వ అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్​ చేసుకున్నాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ వెస్ట్  ఢిల్లీకి చెందిన నిఖిల్ మదన్ (37) గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్​బీ) లో గత ఐదేండ్ల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్​గా పని చేస్తున్నాడు. 

నిఖిల్​కు 9 నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి భార్య ప్రేరణతో కలిసి  ఐఎస్‌‌‌‌బీ క్యాంపస్‌‌‌‌లో ఉన్న ప్రొఫెసర్స్ క్వార్టర్స్​లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో భార్య టీవీ చూస్తుండగా.. నిఖిల్ 17 వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

పెద్ద ఎత్తున శబ్దం రావడంతో కిందకు వెళ్లి చూసిన ప్రేరణకు నిఖిల్ రక్తపు మడుగులో కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన గచ్చిబౌలి పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.   తనవల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా నిఖిల్​ తీవ్రంగా ఆలోచిస్తాడని, గత కొంతకాలంగా తీవ్ర డిప్రెషన్​తో బాధపడుతున్నాడని, డాక్టర్ వద్ద ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నాడని పోలీసులకు భార్య ప్రేరణ తెలిపింది.