తండాలో విషాదం.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య

తండాలో విషాదం.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని కొత్తూరు మండలం కోడిచెర్ల తండాకు చెందిన స్వర్ణ మరియు ఆమె ఏడాదిన్నర చిన్న కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం తల్లీకూతుళ్ల మృతదేహాలను గ్రామస్తులు తాండ దగ్గరలో ఉన్న క్వారీలో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న కొత్తూరు సీఐ శ్రీధర్ కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త‌ల్లీకూతుళ్లుబ‌కుటుంబ కలహాల వల్ల చనిపోయారా? లేక ఇంకా ఏదైనా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.