రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని మొగిలిగిద్ద గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు చంద్రకళ (40), స్రవంతి (17) మంటల్లో చిక్కకుని 90 శాతం వరకు కాలిపోయారు. ఇద్దరు మంటల్లో కాలిపోతుండగా గమనించిన స్థానికులు మంటలు ఆర్పి వారిని షాద్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదిలా ఉండగా కూతురు ప్రేమ వ్యవహారం నచ్చక తండ్రే ఈ పని చేసి ఉంటాడని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ప్రేమ వ్యవహారం పై తల్లిదండ్రులు మందలించగా కూతురు స్రవంతి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చెయ్యడంతో ఆర్పడానికి వెళ్లిన తల్లికి నిప్పంటుకుని ఇద్దరు ప్రమాద స్థాయిలో కాలినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.