- ఇంగ్లాండ్లో దారుణం
మాంచెస్టర్: తల్లి కోసం ప్రాణాలిచ్చాడో కొడుకు. తల్లిపై దుండగుడు కత్తితో దాడి చేయగా కొడుకు అడ్డుకున్నాడు. కత్తిపోట్లకు గురైన అతను ఆసత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో జరిగింది. కటార్జినా బస్టెక్(40)కు నలుగురు కొడుకు లు. వారిలో ఒకరు జాకుబ్ జిమాన్ స్కీ(15). గురువారం రాత్రి వీళ్ల ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడ్డాడు. కటార్జినాపై కత్తితో దాడికి తెగబడ్డాడు. అదిచూసిన జాకుబ్ వెంటనే దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు కత్తితో పలుమార్లు పొడిచినప్పటికీ విడిచిపెట్టలేదు. తల్లీకొడుకు ఇద్దరిపై దాడిచేసిన దుండగుడు పారిపోయాడు. తల్లీకొడుకును ఆస్పత్రికి తరలించగా, అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ కొడుకు చనిపోయాడు. తల్లి కోలుకుంటోంది. కాగా, ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్న వ్యక్తిని మాంచెస్టర్కు 400 కి.మి. దూరంలోని కెంట్ కౌంటీలో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.