
చందానగర్, వెలుగు: చందానగర్ పోలీస్స్టేషన్పరిధిలో ఇద్దరి పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన ముల్క ప్రశాంత్ భార్య రజిత(32) ఇద్దరు పిల్లలతో కలిసి చందానగర్లోని ఆదర్శనగర్లో నివాసం ఉంటున్నాడు.
పిల్లలు జ్యోతిక(10), సుందర్(8) సమీపంలోని కేఎస్ఆర్స్కూల్లో చదువుతున్నారు. సోమవారం స్కూలు నుంచి పిల్లలను బయటకు తీసుకెళ్లిన రజిత ఇంటికి రాలేదు. దీంతో భర్త ప్రశాంత్ చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.