అమ్మతనం.. ఈ ప్రపంచంలో అన్నింటికన్న గొప్పది.. ఏ ప్రేమతోనీ, త్యాగంతోనీ పోల్చలేనిది. తొమ్మిది నెలలు మోసి, పురిటి నొప్పులు భరించి, చావు వరకు వెళ్లి పునర్జన్మను పొందిన గొప్ప జన్మ. అలా నవమాసాలు మోసి కన్న కొడుకును.. ముక్కుపచ్చలారక ముందే చంపేసింది. ఆ పసిగుడ్డు ఏడుపు ఆమెను ఇబ్బంది పెట్టిందట. కన్న కొడుకు ఆకలి కేకలను పాలిచ్చి చల్లార్చాల్సిన తల్లి.. నోట్లో గుడ్డలు కుక్కి భగభగ మండుతున్న పొయ్యిలో పడేసి చంపేసింది. ఇలాంటి తల్లినే కదా కసాయి తల్లి అనేది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో జరిగింది ఈ అమానవీయ ఘటన. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట్ లో తన 2 నెలల కన్న కొడుకును చంపేసింది ఈ కసాయి తల్లి. ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నాడని చేతులు కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి కట్టేల పొయ్యిలో పడేసింది. పొయ్యిలో సగం కాలిపోయి.. గాయాలతో ప్రాణాలు వదిలాడు బాలుడు.
►ALSO READ | హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్.. సైబర్ క్రైం కేసుల్లో 104 మంది అరెస్ట్.. 200 మొబైల్స్ సీజ్
దంపతులను స్థానికంగా ఒక అపార్ట్మెంట్ లో పని చేస్తున్న బీహార్ కు చెందిన వారీగా గుర్తించారు. కసాయి తల్లి కర్కశత్వానికి కన్న కొడుకు ప్రాణాలు విడవడంతో, తండ్రి కన్నీటి పర్యంతం అవుతున్నాడు. బౌరంపేట్ లోని నిర్మాణంలో ఉన్న సానరేల్లి అపార్ట్మెంట్ దగ్గర జరిగింది ఈ ఘటన. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
