యాదాద్రి నరసింహుడి సన్నిధి నుండే కేసీఆర్ పతనం ప్రారంభం

యాదాద్రి నరసింహుడి సన్నిధి నుండే కేసీఆర్ పతనం ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరిగుట్టలో రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి రోడ్డు విస్తరణ బాధితులను ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఆదివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలో మాట్లాడుతూ.. అలైన్మెంట్ మార్చడం కుదరకపోతే గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లుకు ఇల్లు, షాపుకు షాపు కట్టించిన తర్వాతే ప్రస్తుత ఇండ్లను కూల్చాలన్నారు.

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోనే బాధితులకు ఇండ్లు కట్టించాలన్న మోత్కుపల్లి.. పేదోళ్ల బతుకులతో ఆడుకుంటే పాపం తగులుతుందన్నారు. బాధితులకు న్యాయం చేసి పాపాల నుండి విముక్తి పొందు కేసీఆర్ అన్నారు. లేకపోతే యాదాద్రి నరసింహుడి సన్నిధి నుండే నీ పతనం ప్రారంభమవుతుందన్నారు. రానున్న రోజుల్లో ఆలేరు, భువనగిరిలో బీజేపీ జెండా ఎగురుతుందని.. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు మోత్కుపల్లి.