
కొరియోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవా.. ఆ తర్వాత నటుడిగాను, దర్శకుడిగాను కూడా ఇంప్రెస్ చేశారు. రీసెంట్గా కిడ్స్ ఫ్యాంటసీ మూవీ ‘మై డియర్ భూతం’లో నటించారు. రమేష్ పి పిళ్ళై దర్శకత్వం వహించిన ఈ ఈ చిత్రం ఇవాళ విడుదలవుతున్న సందర్భంగా ప్రభుదేవా ఇలా ముచ్చటించారు.
‘‘క్యారెక్టర్ కొత్తగా అనిపించడంతో పాటు క్లైమాక్స్ హార్ట్ టచింగ్గా అనిపించి ఓకే చెప్పా. ఒక పిల్లాడి జీవితంలో భూతం ఏం చేస్తుందనేదే సినిమా. మంచి ఎంటర్టైనర్. నేను, అబ్బాయి, అతని తల్లి చుట్టూ తిరిగే కథ. గడ్డం తీసేయడంతో పాటు పిలక కూడా పెట్టుకున్నా. కేవలం ఐదు సెకన్ల సీన్ కోసం మీసం కూడా తీసేశా. పిల్లలకు బాగా రీచ్ అవుతుందనడంతో చేసేశా. నా గెటప్ వింతగా ఉందని అందరూ నవ్వుకునేవారు. నలభై అయిదు రోజుల్లో తీశాం. కానీ సీజీ వర్క్కి పదకొండు నెలలు పట్టింది. ‘తారే జమీన్ పర్’ లాంటి సినిమా. ‘అల్లావుద్దీన్’తో ఎలాంటి సంబంధం లేదు. నేను నటిస్తున్నానని ఓ పాట కూడా పెట్టారు. కొవిడ్తో డ్యాన్స్కి గ్యాప్ రావడంతో కాలు కదపలేకపోయాను. వారం రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది. కమర్షియల్ సినిమాలు చేసినా అందులోనూ ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలనుకుంటాను. ఒంటి కాలితో ఓ సినిమాలో నటిస్తున్నా. మరో సినిమాలో శవంలా నటిస్తున్నా. సినిమా మొత్తం అలానే కనిపిస్తా. ఒక యాక్షన్ మూవీ కూడా చేస్తున్నా. నా డైరెక్షన్లో నెక్స్ట్ మూవీ ఇంకా ఫిక్స్ కాలేదు. జులై లాస్ట్ వీక్లో చిరంజీవి గారితో ఓ సాంగ్ చేయబోతున్నా. అంచనాలు ఎక్కువ ఉంటాయి కనుక భయంగా ఉంది. ‘ప్రేమికుడు’కి ఇప్పటికీ ఏం మారలేదు, ఎలా సాధ్యమని అడుగుతుంటారు. ఇందులో సీక్రెట్ అంటూ ఏమీ లేదు. అనుకున్నది జరిగితే మంచిది, జరగకపోతే ఇంకా మంచిది అనుకుంటానే తప్ప ఎక్కువగా ఆలోచించను. దేనికీ టెన్షన్ పడను... టెన్షన్ పెడతాను.’’