స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ది ట్రయల్’. రామ్ గన్ని దర్శకత్వంలో స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్కు మంచి స్పందన వచ్చింది.
థియేటర్స్లోనూ సినిమాకు ఇదే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని టీమ్ ఆశిస్తోంది. ఈ నెల 24న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుందని మేకర్స్ నమ్మకంతో చెబుతున్నారు.