
రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మారేడుమిల్లిలో కీలక షెడ్యూల్ను పూర్తి చేశారు. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్స్లను షూట్ చేశారు.
ఈ సీన్స్ సినిమాకు హైలైట్గా ఉంటాయని మేకర్స్ చెప్పారు. ఇంకో షెడ్యూల్తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుందని, అలాగే ఈ నెలలోనే టీజర్ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో లవ్స్టోరీగా రూపొందిస్తున్న ఈ చిత్రం థ్రిల్లింగ్, అడ్వెంచర్ ఎలిమెంట్స్తో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంతో సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్గా పరిచయమవుతోంది. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.