మోగ్లీలో మ్యాసివ్ యాక్షన్ సీన్స్

మోగ్లీలో మ్యాసివ్  యాక్షన్ సీన్స్

రోషన్ కనకాల హీరోగా  నటిస్తున్న  చిత్రం ‘మోగ్లీ 2025’.  ‘కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటో’ ఫేమ్  సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మారేడుమిల్లిలో కీలక షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను  పూర్తి చేశారు. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లను  షూట్ చేశారు.  

ఈ సీన్స్ సినిమాకు హైలైట్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని మేకర్స్ చెప్పారు. ఇంకో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుందని, అలాగే ఈ నెలలోనే టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలియజేశారు.  ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో  లవ్‌‌‌‌‌‌‌‌స్టోరీగా రూపొందిస్తున్న ఈ చిత్రం థ్రిల్లింగ్, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు.  ఈ చిత్రంతో  సాక్షి సాగర్‌‌‌‌‌‌‌‌ మదోల్కర్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పరిచయమవుతోంది.  కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.