అధికారుల పోస్టింగ్ ‌‌కు రూ.లక్షలు తీసుకుంటున్నడు : అర్వింద్

అధికారుల పోస్టింగ్ ‌‌కు రూ.లక్షలు తీసుకుంటున్నడు  : అర్వింద్

మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గంలో అధికారులకు పోస్టింగ్ ‌‌లు ఇప్పించేందుకు ఎమ్మెల్యే విద్యాసాగర్ ‌‌ ‌‌రావు రూ.లక్షలు తీసుకుంటున్నాడని నిజామాబాద్ ఎంపీ అర్వింద్​ఆరోపించారు. శుక్రవారం మెట్ ‌‌పల్లిలో నిర్వహించిన పసుపు రైతుల కృతజ్ఞత సభకు ఎంపీ హాజరై మాట్లాడారు.

నియోజకవర్గంలో సీఐ పోస్టింగ్ ‌‌కు రూ.15 లక్షలు, ఎస్సైకు రూ.10 లక్షల చొప్పున వసూల్​చేస్తున్నాడని మండిపడ్డారు. దళితబంధు మంజూరుకు  రూ.3లక్షలు,  సీఎంఆర్ఎఫ్ లో రూ.30వేల చొప్పున నుంచి తీసుకుంటున్నాడని ఆరోపించారు. తాను కోరుట్ల నుంచి పోటీ చేస్తానని, ఎమ్మెల్యే కొడుకు, బీఆర్ఎస్​ అభ్యర్థి సంజయ్ ​భయపడుతున్నాడన్నారు.