తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ సీఎం : ఎంపీ అర్వింద్​

తెలంగాణలో  బీజేపీ గెలిస్తే బీసీ సీఎం : ఎంపీ అర్వింద్​

గాంధారి(ఎల్లారెడ్డి), వెలుగు: తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ కోరారు. గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి టౌన్ లో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్ లో  ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంచి నాయకుడైన సుభాష్​రెడ్డికి టికెట్​ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేస్తే, బీజేపీ టికెట్ ఇచ్చి గౌరవించిందన్నారు.

కాంగ్రెస్​రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కేసీఆర్​ను గెలిపించడానికే కామారెడ్డిలో పోటీచేస్తున్నారన్నారు. ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలో 5 సీట్లను కైవసం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని కూడా మోసం చేసిందని అన్నారు. 

Also Read :-తాళం కప్పను మింగిన బాలుడు.. ఎండోస్కోపి చేసి బయటకు తీసిన డాక్టర్