సమైక్యత కాదు.. విమోచన దినమే.. 

సమైక్యత కాదు.. విమోచన దినమే.. 

తెలంగాణ అమరవీరులను సీఎం కేసీఆర్ అగౌరవపరిచాడని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. విమోచన దినోత్సవంపై ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలో కవిత, కేటీఆర్ డిమాండ్ చేసిన విషయాన్ని అర్వింద్ గుర్తు చేశారు. ఈ విషయంలో కేసీఆర్ కుటుంబ తీరు దురదృష్టకరమని అన్నారు. 

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు చేయాల్సినవన్నీ చేస్తామని అర్వింద్ స్పష్టం చేశారు. కేంద్రం విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడంపై తెలంగాణ సమాజం హర్షిస్తోందని చెప్పారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవమే తప్ప జాతీయ సమైక్యతా దినోత్సవం ఏ మాత్రం కాదని అర్వింద్ తేల్చి చెప్పారు.