
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్కు చెందిన ఓ కార్యకర్త కాలుపై నుంచి ఎంపీ కే. కేశవరావు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాధితుడి పాదంలో రెండు చోట్ల ఎముకలు విరిగాయి. బుధవారం తెలంగాణ భవన్లో వరంగల్లోక్సభ సన్నద్ధతా సమావేశం నిర్వహించారు. దానికి జయశంకర్భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త అటెండ్ అయ్యాడు.
మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో శ్రీనివాస్ బయటకు రాగా.. అదే సమయంలో కేకే కారు ఆయన కుడి కాలుపై నుంచి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే కేకే తన కారు దిగి గాయపడిన కార్యకర్తను సమీపంలోని ఒమేగా హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఎక్స్రే తీసి పాదంలో రెండు ఎముకలు విరిగినట్టుగా నిర్ధారించారు. సిమెంట్పట్టీ వేసి బాధితుడిని ఇంటికి పంపించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది.